అశ్విన్బాబు, నందిత శ్వేత జంటగా నటిస్తున్న చిత్రం ‘హిడింబ’. అనిల్ కన్నెగంటి దర్శకుడు. గంగపట్నం శ్రీధర్ నిర్మాత. ఇటీవల సెన్సార్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలపై సెన్సార్ వాళ్లు అభ్యంతరం తెలపడంతో ఇటీవల రివ్యూ కమిటీ ద్వారా చిత్రం రీసెన్సార్ను పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ, టచ్ చేయని జానర్తో రూపొందిన సినిమా ఇది.యూనిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని థ్రిల్ల్ని ఇచ్చే విధంగా దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ నెల 20న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: అనిల్ సుంకర.