అశ్విన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హిడింబ’. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. యువ హీరో సాయిధరమ్తేజ్ శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్కు చారిత్రక నేపథ్యాన్ని మేళవించి ఈ సినిమాను తెరకెక్కించాం.
తెలుగులో ఈ తరహా కాన్సెప్ట్తో సినిమా రాలేదు’ అన్నారు. చరిత్ర, సమకాలీన అంశాలు కలబోసిన వినూత్న కథాంశమిదని, తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో తాను కీలకమైన పాత్రను పోషించానని నందితాశ్వేత పేర్కొంది.