ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు మళ్లీ నిరాశే ఎదురైంది. అతని బెయిల్ పిటిషన్ను బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ జరపనున్నట్లు కోర్టు సోమవారం తెలిపింది. బుధవారంలోపు దీనిపై మీ వాదన వినిపించాలని ఎన్సీబీని జడ్జి జస్టిస్ వీవీ పాటిల్ ఆదేశించారు. అయితే బుధవారం తాము కేవలం ఆర్యన్ఖాన్ విషయంలోనే తమ వాదన వినిపిస్తామని, మిగతా వాళ్లపై రిప్లై ఫైల్ చేయబోమని ఎన్సీబీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్పార్టీకి సంబంధించి ఆర్యన్ఖాన్ను ఎన్సీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు.