శర్వానంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నది. మ్యాడ్, 8 వసంతాలు ఫేం అనంతిక సనీల్కుమార్ కథానాయికగా ఎంపికైంది. ఇదిలావుంటే.. ఈ సినిమాలో అరవింద్స్వామి ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది.
ఇప్పటికే ఆయన తెలుగులో మౌనం, ధృవ, కస్టడీ చిత్రాల్లో నటించారు. ఇది ఆయన నటిస్తున్న నాలుగో తెలుగు సినిమా. అరవింద్స్వామి పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలో కీలకమైన మరో నెగెటివ్ పాత్ర కూడా ఉందని, ఆ పాత్రలో మరో సీనియర్ హీరో కనిపించనున్నారని వినికిడి.