కోల్కతా : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. బ్లాక్బస్టర్ మూవీ కోసం వేచిచూసిన బాలీవుడ్కు పఠాన్ కాసుల వర్షం కురిపించింది. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో ఓ ఆర్టిస్ట్ కింగ్ ఖాన్ పఠాన్ గెటప్లో ఉన్న మైనపు విగ్రహాన్ని తయారుచేశాడు.
ఆర్టిస్ట్ సుశాంత్ రాయ్ రెండు నెలల పాటు శ్రమించి షారుక్ ఖాన్ లైఫ్ సైజ్ మైనపు విగ్రహాన్ని రూపొందించాడు. అసన్సోల్లోని తన వ్యక్తిగత మ్యూజియంలో రాయ్ ఈ విగ్రహాన్ని ఉంచాడు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పెద్దసంఖ్యలో జనం షారుక్ మైనపు విగ్రహాన్ని సందర్శించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. తాను గతంలో పలువురు బాలీవుడ్ నటుల మైనపు విగ్రహాలు తయారుచేశానని సుశాంత్ రాయ్ చెప్పుకొచ్చారు.
పఠాన్ స్టాట్యూ తొమ్మిదో విగ్రహమని చెప్పారు. అసన్సోల్ మేయర్ విధాన్ ఉపాధ్యాయ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి రాయ్ పనితీరును మెచ్చుకున్నారు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ టీం ఓనర్ అయిన తర్వాత బెంగాల్లో కూడా షారుక్ ఖాన్ పాపులారిటీ పెరిగిపోయింది. ఇక షారుక్ విగ్రహంతో అసన్సోల్కు టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని సుశాంత్ రాయ్, విధాన్ ఉపాధ్యాయ్లు పేర్కొన్నారు.
Read More