ప్రముఖ కళా దర్శకుడు సునీల్ బాబు (50) గుండెపోటుతో కేరళ ఎర్నాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా సునీల్ బాబు పనిచేశారు. ‘ఉరిమి’, ‘బెంగళూరు డేస్’, ‘గజిని’, ‘నోట్ బుక్’ వంటి చిత్రాలు ఆయనకు కళా దర్శకుడిగా పేరు తీసుకొచ్చాయి. ఇటీవల తెలుగులో విజయం సాధించిన ‘సీతారామం’ చిత్రానికి ఆయన ఆర్ట్ వర్క్ చేశారు. సునీల్ బాబు పనిచేసిన ‘వారసుడు’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. సునీల్ బాబు హఠాన్మరణం దక్షిణాది చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనతో పనిచేసిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు సంతాపాలు తెలియజేశారు.