‘అరణ్మనై’ ఫ్రాంఛైజీ సిరీస్లో వస్తున్న నాలుగో చిత్రం ‘బాక్’. స్వీయ దర్శకత్వంలో సుందర్ సి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. తెలుగు, తమిళ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎండల తీవ్రత దృష్ట్యా మే 3కి వాయిదా వేశామని మేకర్స్ తెలిపారు.
‘హారర్ థ్రిల్లర్ కథాంశమిది. తమన్నా శివాని పాత్రలో కనిపిస్తుంది. త్వరలో ట్రైలర్ను విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఇ. కృష్ణమూర్తి, సంగీతం: హిప్హాప్ తమిళ, తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, కథ, దర్శకత్వం: సుందర్ సి.