OG Movie Tickets Hike | పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ఓజీ. ఈ నెల 25న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ మూవీ టికెట్ల ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూవీ నిర్మాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య విజ్ఞప్తి మేరకు టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటిగంటకు సైతం బెనిఫిట్ షో వేయనున్నారు. జీఎస్టీతో కలిపి టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించారు. అదే సమయంలో ఈ నెల 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రిన్లో జీఎస్టీతో కలిపి రూ.125, మల్టిప్లెక్స్లో జీఎస్టీతో కలిపి రూ.150 వరకు ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి నిర్మాత దానయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్కు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెప్పారు. ఓజీ మూవీలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తుండగా.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నది. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్తో పాటు పలువురు నటీనటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి సుజీత్ దర్శకత్వం వహించగా.. తమన్ సంగీతం అందించారు. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలకు పెంపునకు అనుమతి ఇవ్వడంతో త్వరలోనే అడ్వాన్స్డ్ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్ ఓపెన్ చేయగా.. కొద్ది రోజుల్లోనే 40వేలకుపైగా టికెట్లు ఉత్తర అమెరికాలో సేల్ అయినట్లు తెలుస్తున్నది. పవన్ చివరిసారిగా హరిహరవీరమల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలువగా.. ఈ చిత్రంపైనే భారీగా అంచనాలున్నాయి.
We extend our heartfelt thanks to the Honourable CM Sri @NCBN garu and Honourable Deputy CM Sri @PawanKalyan garu for passing the new G.O. in Andhra Pradesh for the #OG release.
Special thanks to the Cinematography Minister Sri @kanduladurgesh garu for his constant support.
— DVV Entertainment (@DVVMovies) September 17, 2025