టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్లో నటించిన చిత్రం మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి..మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు..నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత మేజర్ను ప్రశంసిస్తూ..అడివిశేష్ బాహుబలి కోస్టార్లు రానా, అనుష్క నెట్టింట పోస్టులుపెట్టారు.
మేజర్ చిత్రాన్ని చాలా బాగా తీశారు. నటీనటులు, టెక్నికల్ టీం ఉత్తమంగా పనిచేశారు. కథ గొప్పగా చెప్పిన శశి అండ్ అనురాగ్ రెడ్డి టీం అంతా గర్వపడే మంచి సినిమా అందించారు. అద్బుతమైన టాలెంట్కు మహేశ్ అండగా నిలిచారు..అని రానా (Rana) పోస్ట్ పెట్టాడు.
ఈ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్కు అందమైన నివాళి. సినిమా చాలా చాలా బాగుంది. ఈ కథను మాకు అందించిన మేజర్ చిత్రబృందానికి ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు. హీరో అడివి శేష్, డైరెక్టర్ శశి కిరణ్ టిక్కా, వంశీ.. ప్రకాష్ రాజ్, రేవతి , మురళీ శర్మ , సయీ మంజ్రేకర్ , శోభితా ధూళిపాళ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, సిబ్బందికి అభినందనలు. మేజర్ సినిమాను దయచేసి థియేటర్లలో చూడండి అంటూ సందేశాన్ని పోస్ట్ చేసింది స్వీటీ (Anushka) .
Congratulations @AdiviSesh , director sashi kiran tikka , Vamsi .. Prakash raj garu , Revathi garu , Murli Sharma garu , saiee Manjrekar , Sobhita dhulipala..all the actors ,technicians ,crew 🥰
Please watch #MajorTheFilm it in the theatres 🤗 pic.twitter.com/lybVBrlFYr— Anushka Shetty (@MsAnushkaShetty) June 4, 2022