కెరీర్ ఆరంభంలో తెలుగు చిత్రసీమలో అద్భుతమైన విజయాల్ని సొంతం చేసుకుంది మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్. కొంతకాలంగా రేసులో వెనకబడ్డ ఈ వయ్యారి తిరిగి చక్కటి అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నది. ప్రస్తుతం యువహీరో నిఖిల్ నటిస్తున్న ‘18పేజెస్’లో అనుపమపరమేశ్వరన్ నాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భామ మరోసారి నిఖిల్తో జోడీగా నటించబోతున్నది. వివరాల్లోకి వెళితే…చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన ‘కార్తికేయ’ చిత్రం మిస్టరీ థ్రిల్లర్గా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ‘కార్తికేయ-2’ పేరుతో సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇందులో కథానాయికగా అనుపమపరమేశ్వరన్ నటిస్తున్నది. ఈ విషయాన్ని హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈ సినిమాలో నాయిక ఎవరనే విషయాన్ని చాలా రోజులు రహస్యంగా ఉంచాం. ఇప్పుడు బయటపెడుతున్నాం. అనుపమతో మరోసారి నటించడం ఆనందంగా ఉంది’ అని నిఖిల్ తెలిపారు.