Annapoorani Movie | కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం ‘అన్నపూరణి’ పలు వివాదలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రాముడిని కించపరిచేలా, లవ్ జీహాద్ను ప్రోత్సహించేలా ఉందంటూ శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఈ సినిమాపై ఆరోపణలు రావడంతో నెట్ఫ్లిక్స్ కూడా ఈ సినిమాను తన ప్లాట్ఫామ్ నుంచి తొలగించింది. ఇక ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ నుంచి డిలీట్ చేయడం వలన ఈ విషయాన్ని కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
ఇదిలావుంటే.. నెట్ఫ్లిక్స్ నుంచి డిలీట్ అయిన ఈ చిత్రం తాజాగా కొత్త ఓటీటీని వెతుక్కుంది. సాత్ ఇండియన్ సినిమాలకు చెందిన ప్రముఖ ఓటీటీ దిగ్గజం సింప్లీ సౌత్ (Simply South)లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
With sweet, kaaram, and all ingredients. With fun, drama, and all emotions.#Nayanthara‘s #Annapoorani is streaming now on Simply South. 🥘
▶️ https://t.co/VFRq68X7rK pic.twitter.com/XSacB54v1F
— Simply South (@SimplySouthApp) January 11, 2024
ఇంతకీ ఏం జరిగిందంటే
‘అన్నపూరణి’ సినిమా చూసిన మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి మూవీలోని కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘అన్నపూరణి’ సినిమాలో రాముడు కూడా మాంసం తిన్నాడు అనడం.. శ్రీరాముడిని కించపరిచేలా ఉందని.. అలాగే హీరో ముస్లిం అయ్యి ఉండడం, హీరోయిన్ బ్రాహ్మణ కుటుంబానికి చెంది ఉండడంతో లవ్ జీహాద్ను ప్రోత్సహించేలా ఉందని.. ఈ మూవీ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని రమేశ్ సోలంకి ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై వివాదం ఎక్కువ అవ్వడంతో నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ సినిమా విషయంలో నయనతారపై కూడా కేసు నమోదు అయ్యింది.