అంకిత్, తన్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘జాన్ సే’. సుమన్, అజయ్, తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్. కిరణ్ కుమార్ దర్శకుడు. ఈ సినిమా ప్రోగ్రెస్ను తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. దర్శకుడు ఎస్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ…‘క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. కొత్త నటీనటులైనా ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కిస్తున్నాం. ఈ నెలాఖరుతో పూర్తయ్యే చివరి షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరిపి వీలైనంత త్వరగా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మోహన్ చారి, సంగీతం : సచిన్ కమల్.