Animal Movie | ఇప్పుడున్న బాలీవుడ్ యువ నటులలో ప్రేక్షకులు అమితంగా అభిమానించేది అంటే రణబీర్ కపూర్నే (Ranbir Kapoor). రాక్స్టార్ సినిమాతో స్టార్డం తెచ్చుకున్న ఇతడు ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ ఖాన్ త్రయం తర్వాత బాలీవుడ్ మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. ఇక రణబీర్ కపూర్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘యానిమల్’(Animal). సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అర్జున్ రెడ్డి (Arjun reddy), కబీర్ సింగ్ల(Kabhir Singh)తో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టి తెలుగు దర్శకుడిగా ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన సందీప్ యానిమల్ అంటూ వస్తుండటంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాతో కేవలం సౌత్లోనే రణబీర్కు వంద కోట్ల బొమ్మ అవుతుందనడంలో ఆశ్చర్యమే లేదు.
ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, ట్రైలర్లు సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే యానిమల్ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్రాజు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్లో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. యానిమల్ సినిమా తెలుగు రైట్స్ను దిల్రాజు రూ.15 కోట్లకు చేజిక్కించుకున్నారని సమాచారం. అయితే రణబీర్ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం ఇదే తొలిసారి.
మరోవైపు.. రణబీర్ లాస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర ఇక్కడ రూ.12 కోట్ల గ్రాస్ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా బ్రహ్మాస్త్రనే ఆ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొడితే.. తండ్రీకొడుకుల సెంటిమెంట్తో వస్తున్న యానిమల్కు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా డబుల్ మార్జిన్తో హిట్టు కొట్టడం ఖాయం అని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు.
ఇక హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను డిసెంబర్ 1న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు. ఇప్పటికే ముంబయిలో చేసిన ప్రమోషన్స్కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో తెలుగులోనూ అదే స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. దానికోసం హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీని ఎంచుకున్నారు. నవంబర్ 27 తేదిన ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఇక ఈ విషయాన్ని రణబీర్ కపూరే స్వయంగా వెల్లడించడం విశేషం.