‘అర్జున్రెడ్డి’ చిత్రంతో సంచలనం సృష్టించారు దర్శకుడు సందీప్రెడ్డి వంగా. ‘కబీర్సింగ్’ పేరుతో బాలీవుడ్లో పునర్నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొంది. తొలి చిత్రంతోనే తెలుగు, హిందీ చిత్రసీమల్లో దర్శకుడిగా తనదైన ముద్రవేసిన సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ద్వితీయ చిత్రం ‘యానిమల్’. రణ్బీర్కపూర్ హీరోగా నటిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతలు.
నూతన ఏడాదిని పురస్కరించుకొని శనివారం చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇందులో రణ్బీర్కపూర్ రక్తమోడుతున్న దుస్తుల్లో గొడ్డల్ని పట్టుకొని టెర్రిఫిక్గా కనిపిస్తున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఆయన లుక్ ఆసక్తినిరేకెత్తించేలా ఉంది. ‘ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. వినూత్నమైన కథాంశంతో రూపొందిస్తున్నాం. రణబీర్కపూర్ పాత్ర నవ్యపంథాలో ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఆగస్ట్ 11న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.