రణబీర్కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. రష్మిక మందన్న కథానాయిక. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ను గురువారం విడుదల చేశారు. ఈ సినిమాలో రణబీర్కపూర్, అనిల్ కపూర్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య అనుబంధాన్ని, సంఘర్షణను ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
ఎమోషనల్ సీన్స్తో పాటు యాక్షన్ ఘట్టాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనదైన మార్క్ మేకింగ్తో మెప్పించారు. తండ్రి పట్ల అంతులేని ప్రేమను కనబరిచే కొడుకుగా రణబీర్కపూర్ నటన హైలైట్గా నిలిచింది. తన తండ్రిని చంపిన వారి తలలు తీస్తానని రణబీర్కపూర్ ప్రతిజ్ఞ చేయడం..ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగభరితంగా అనిపించాయి. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా.