టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా చేసిన ఆ చిత్రం హిట్ టాక్ సంపాదించుకుంటుంది. చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పరిస్థితులు అనుకూలించాక తిరిగి షూటింగ్ మొదలు పెడతామని అంటున్నాడు.
ఎఫ్ 3 చిత్రం లాఫింగ్ థెరపీలా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని అన్నారు అనీల్ రావిపూడి. ఇక బాలయ్య సినిమాల మల్టీ స్టారర్ కాదని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తైందని పేర్కొన్నాడు. ఇక మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ కూడా లాక్ అయింది. త్రివిక్రమ్ చిత్రం తర్వాత ఈ సినిమా ఉండొచ్చు. రాజా ది గ్రేట్ చిత్రం సీక్వెల్ కూడా ప్రస్తుతం చర్చలలో ఉంది. ఎఫ్ 3 చిత్రం తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తాను అని అనీల్ రావిపూడి అన్నారు.