మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హడావిడి ముగిసింది. మంచు విష్ణు ..ప్రకాశ్ రాజ్పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆయన ప్యానెల్లో పది మంది గెలవగా, మిగతా 8 మంది ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచారు. అయితే ఈసీ మెంబర్గా పోటీ చేసిన అనసూయ భారీ ఆధిక్యంతో దూసుకుపోతుందని ఆదివారం జోరుగా ప్రచారం జరగింది. సోమవారం చూస్తే ఆమెపై పోటీ చేసిన సుధీర్కు 279 ఓట్లు వచ్చాయి. ఈసీ మెంబర్గా గెలుపొందాడు. అనసూయ మాత్రం ఓడిపోయింది అన్నారు. దీంతో కంగుతిన్న అనసూయ తన ట్విట్టర్లో సెటైరికల్ ట్వీట్ వేసింది.
ఆదివారం రాత్రి గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఎలక్షన్స్ రూల్స్కి భిన్నంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ వరుస ట్వీట్లు చేసింది. రాత్రికి రాత్రి ఏంజరుగుతుందబ్బా.. అసలు ఉన్న సుమారు 900ఓటర్లలో సుమారు 600చిల్లర ఓటర్లు లెక్కింపుకి రెండో రోజుకి వాయిదా వేయాల్సింత టైం ఎందుకు పట్టిందంటారు? అహ అర్ధంకాక అడుగుతున్నాను’ అంటూ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఉద్దేశ్యంలో అనసూయ వెటకారంగా ట్వీట్ వేసింది. అనసూయ చేసిన ట్వీట్స్ వైరల్గా మారాయి.