Anchor Anasuya Bharadwaj | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు, యాంకర్ అనసూయకు మధ్య వివాదం ఈనాటిది కాదు. ఆరేళ్ల క్రితం వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో వీళ్ల మధ్య వివాదాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి వీళ్ల మధ్య మనస్పర్థలు పెరుగుతూనే వచ్చాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఖుషీ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా అనసూయ విమర్శలు చేసింది. ఇక రౌడీ ఫ్యాన్స్ కూడా అనసూయపై అదే రేంజ్ లో ట్రోల్స్ చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ వీళ్లద్దిర మధ్య వివాదం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. కాగా తాజాగా అనసూయ వీటికి ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు తెలిపింది.
విమానం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో వివాదాలకు ముగింపు పలుకుతున్నట్లు అనసూయ చెప్పుకొచ్చింది. గతంలో తాను విజయ్ తో మాట్లాడడానికి చాలా ట్రై చేశానని, కానీ అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పింది. అంతేకాకుండా తనపై కొందరు డబ్బులిచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తున్నారని, ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డానని అనసూయ పేర్కొంది. అంతేకాకుండా తనకు పీఆర్ టీమ్ లేదని, ఏదైనా తనే మాట్లాడుతానని చెప్పింది. ఇక ట్విట్లు కూడా తనే చేశానని, ఇకపై ఈ వివాదానికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం అనూసయ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలలో నటిస్తుంది. అందులో పుష్ప ది రూల్ కూడా ఒకటి. తొలిపార్టులో మంగళం శ్రీను భార్యగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక సీక్వెల్ లో ఈమె పాత్రకు మరింత స్కోప్ ఉండనుందని తెలుస్తుంది. దీనితో పాటుగా తమిళంలో ఫ్లాష్ బ్యాక్ అనే సినిమా చేస్తుంది. ఇక మరో రెండు చిన్న సినిమాలు కూడా చేస్తుంది. మొత్తానికి యాంకరింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ టైమ్ యాక్టర్ గా మారిపోయింది.