Ananya Panday | ‘ఈ ఫోన్ల వల్ల మనశ్శాంతి దూరమవుతున్నది. నా చిన్నతనంలో ఈ ఫోన్ల వాడకం తక్కువ. అప్పుడు ఏ బాధా లేకుండా ప్రశాంతంగా బతికాం. ఇప్పుడు ఫోన్ శరీరంలో భాగం అయిపోయింది. అది లేకపోతే బతకలేని పరిస్థితి. కానీ అందులో వస్తున్న వీడియోలు, మెసేజ్లు ప్రతికూలతను కలిగిస్తున్నాయి. అవి మనుషులను మానసిక బలహీనుల్ని చేస్తున్నాయి. అందుకే నా వ్యక్తిగత సోషల్మీడియా నుంచి కొన్ని పేజీలను ఆన్ఫాలో చేశాను. ఇంకా చేస్తూనే వున్నాను’ అని చెప్పింది అనన్య పాండే.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య పై విషయాలను ప్రస్తావించింది. ‘సెలబ్రిటీని కావడం చేత నా చుట్టూ ఎప్పుడూ అభిమానులు ఉంటారు. ఈ సోషల్మీడియాలో వచ్చే పుకార్లనే వాళ్లంతా ప్రశ్నలుగా సంధిస్తుంటారు. నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. అందుకే.. సాధ్యమైనంతవరకూ ఒంటరిగా బతకటానికి ప్రయత్నిస్తున్నా. నా గురించి నేను ఆలోచించుకునే అవకాశం అప్పుడే కదా ఉండేది’ అంటూ చెప్పుకొచ్చింది అనన్య.