ఈ ఏడాది ప్రారంభంలోనే టాలీవుడ్కు మరో విజయాన్ని అందించింది ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా. సుహాస్, శివాని నాగారం జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పతాకాలు సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించగా, శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు.
ఈ సినిమా సక్సెస్ మీట్ సోమవారం హైదరాబాద్లో జరిగింది. డైరెక్టర్ దుశ్యంత్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి కథలు ఎవరైనా రాస్తారు. ప్రొడ్యూస్ చేసే ధైర్యం ఉన్నవాళ్లు కావాలి. నిర్మాతలతోపాటు కథను నమ్మిన హీరో సుహాస్కు థ్యాంక్స్’ అని చెప్పారు. ‘ఈ సినిమాలో హీరోతోపాటు మిగతా క్యారెక్టర్స్కు ఇంపార్టెన్స్ ఉంది. అదే ఈ స్క్రిప్ట్లో ఉన్న బలం. అందుకే ఈ విజయం’ అని హీరో సుహాస్ అన్నారు. అమ్మానాన్నల తర్వాత తాను రుణపడి ఉండేది డైరెక్టర్ దుశ్యంత్కే అని హీరోయిన్ శివాని తెలిపారు. ఇంకా మిగతా యూనిట్ సభ్యులంతా కార్యక్రమంలో మాట్లాడారు.