సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. దుశ్యంత్ కటికనేని దర్శకుడు. కామెడీ డ్రామా కథాంశమిది. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో ‘మా ఊరు..’ అనే లిరికల్ సాంగ్ను మంగళవారం విడుదల చేశారు. రెహమాన్ రాసిన ఈ పాటకు శేఖర్చంద్ర స్వరాలను సమకూర్చారు. కాలభైరవ ఆలపించారు. ‘రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం..ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం…’ అంటూ అర్థవంతంగా సాగిందీ గీతం. శివాని నాగరం, శరణ్యప్రదీప్, జబర్దస్త్ ప్రతాప్, గోపరాజు రమణ- తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాజిద్ బేగ్, సంగీతం: శేఖర్చంద్ర, రచన-దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని.