ఆదివారం భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. టీ20 వరల్డ్ కప్ల్లో పాక్పై ఇండియాదే పైచేయిగా ఉండడంతో మ్యాచ్కి ముందు అందరు భారత్ గెలవడం పక్కా అని జోస్యాలు చెప్పారు. కాని బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమై ఓటమిని మూటగట్టుకుంది భారత్.
చాలా రోజుల తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగడడంతో ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. సినిమా స్టార్స్ వీలు కుదుర్చుకొని మ్యాచ్ వీక్షించాడు. అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రీతి జింతా వంటి స్టార్స్ స్టేడియంలో సందడి చేశారు. అల్లు అర్జున్(Allu Arjun) తన కుటుంబ సభ్యులతో కూర్చొని మ్యాచ్ వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోని స్నేహా రెడ్డి తన ఇన్స్టా స్టేటస్ లో షేర్ చేసింది.
బన్నీ నటిస్తున్న పుష్ప(pushpa) చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే షూటింగ్కి కాస్త బ్రేక్ ఇవ్వడంతో రీసెంట్గా బన్నీతన ఫ్యామిలీతో మాల్దీవులకి వెళ్లి అక్కడ తెగ సందడి చేశారు. రీసెంట్గా తన కూతురు, భార్యతో కలిసి లాంగ్ డ్రైవ్ కూడా వెళ్లాడు. బన్నీ నటిస్తున్న పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది.
Charmy Kaur | యాక్టింగ్లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం