త్రివిక్రమ్, అల్లు అర్జున్.. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్సే. ఆల్రెడీ ఇది హ్యాట్రిక్ కాంబినేషన్. వీరిద్దరి నాలుగో సినిమాకు కూడా రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమాను రెండు భాగాలు తెరకెక్కించాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
కథ డిమాండ్ చేస్తున్న దృష్ట్యా ఈ సినిమాను రెండు భాగాలుగా తీయడం కరెక్టని త్రివిక్రమ్ నిర్మాతతో చెప్పారట. నాగవంశీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. 2025లో విడుదలయ్యే ఈ సినిమా, దర్శకుడిగా త్రివిక్రమ్కు తొలి పాన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప-2’తో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ‘పుష్ప-2’ విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత ఈ క్రేజీయస్ట్ మూవీ సెట్స్పైకి వెళ్లనుంది.