అల్లు అర్జున్ కథానాయకుడిగా అగ్ర దర్శకుడు సుకుమార్ రూపొందించిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 350కోట్ల వసూళ్లను సాధించి అల్లు అర్జున్ కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. పాన్ ఇండియా స్టార్గా ఆయనకు తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది. పుష్పరాజ్గా అల్లు అర్జున్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, సుకుమార్ టేకింగ్ సర్వత్రా ప్రశంసలందుకుంది. పాటలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ఈ సినిమా రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ‘పుష్ప-2’ (ది రూల్) సోమవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెడతామని, సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహి త్యం: చంద్రబోస్, ప్రొడక్షన్ డిజైనర్: యస్.రామకృష్ణ, మోనిక నిగొత్రే, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేవీవీ బాలసుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబా సాయికుమార్ మామిడపల్లి, సీఈఓ: చెర్రీ, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేసన్ విత్ సుకుమార్ రైటింగ్స్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్.బి.