‘పుష్ప’ ఫ్రాంచైజీతో పానిండియా ఇమేజ్ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘పుష్ప2’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అత్యంత ప్రతిష్టాత్మకంగా సన్ పిక్చర్స్వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు అట్లీ తనదైన శైలి మాస్ ఎలిమెంట్స్కు ఎమోషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్, సైన్స్ ఫిక్షన్ను జోడించి ఈ కథను తయారు చేసినట్టు ఇన్సైడ్ టాక్. ఫస్ట్లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. త్వరలో గ్లింప్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రాకా ప్రపంచాన్ని, దాని విజువల్ స్కేల్ని ఈ గ్లింప్స్ ద్వారా పరిచయం చేయనున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ‘రాకా’ కథ పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందట. మూడు కాలాల్లో నడిచే ఈ కథలో అల్లు అర్జున్ మూడు రకాల భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారట. ‘అగ్ని.. విశ్వం.. త్యాగం..’ ఈ మూడింటి చుట్టూనే ఈ సినిమా కాన్సెప్ట్ నడుస్తుందని తెలిసింది. షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్ కీ రోల్ పోషించే ఈ చిత్రంలో దీపిక పదుకోణ్ కథానాయిక కాగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ప్రత్యేక పాత్రల్లో మెరవనున్నారని సమాచారం.