Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జర్మనీకి పయనమయ్యాడు. జర్మనీలో జరిగే ప్రతిష్టాత్మకమైన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి బెర్లిన్కు బయలుదేరాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనతో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించడానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ గురువారం ఉదయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెర్లిన్ వెళుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప-2లో నటిస్తున్నాడు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రష్మిక కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
Icon star 🌟 @alluarjun is en route to Germany 🇩🇪 to represent the richness of Indian cinema at a prestigious film festival in Berlin.#AlluArjun #Pushpa2TheRule #Pushpa pic.twitter.com/RF68Zz5qXj
— Shreyas Media (@shreyasgroup) February 15, 2024