ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎంటర్టైన్మెంట్ రంగంలో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలతో టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరిగా మారిన అల్లు అరవింద్.. ఆహా అనే తెలుగు ఓటీటీతో అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. తాజాగా ఆయన పీవీ నరసింహారావు బయోపిక్ ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది.ఆహా స్టూడియోస్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రకటించిన అల్లు అరవింద్… పీవీ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు.
ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు దేశంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. భారత రాజకీయాలలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రస్థానం ప్రత్యేకమనే చెప్పాలి. భారతదేశ స్థితిగతుల్ని మార్చేసిన పీవీ తీరుపై గతంలో వినయ్ సీతాపతి ‘హాఫ్ లయన్’ అనే పుస్తకం రాశారు. ఇప్పుడు ఆ పుస్తకం ఆధారంగా పీవీ బయోపిక్ ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకు రాబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝ దీనికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ రోజు ఉదయం వెబ్ సిరీస్ అనౌన్స్మెంట్ చేయగా, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ ని తెరకెక్కించనున్నారు. పీవీ వెబ్ సిరీస్ను ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మించబోతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో 2023లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగులో మాత్రం ఆహలోనే స్ట్రీమ్ అవుతుంది. 2023లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా 1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే.