రామాయణం ఇతిహాసం ఆధారంగా హిందీలో మరో చిత్రం తెరకెక్కబోతున్నది. నితీష్ తివారి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, మధు మంతెన భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఇందులో రాముడిగా రణబీర్కపూర్, సీత పాత్రలో అలియాభట్ నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి అలియాభట్ తప్పుకుందని తెలిసింది.
ప్రస్తుతం హాలీవుడ్తో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్లతో బిజీగా ఉండటం వల్ల రామాయణం చిత్రానికి ఆమె డేట్స్ కేటాయించలేకపోతున్నదని సమాచారం. ఈ నేపథ్యంలో సీత పాత్రలో సాయిపల్లవి పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ దిశగా సంప్రదింపులు పూర్తయ్యాయని, ఈ సినిమాలో నటించేందుకు సాయిపల్లవి సానుకూలంగా ఉందని వార్తలొస్తున్నాయి. ఇటీవలకాలంలో సాయిపల్లవి సినిమాల విషయంలో సెలెక్టివ్గా ఉంటున్నది. ‘లవ్స్టోరీ’ తర్వాత తెలుగులో మరే చిత్రంలో నటించలేదు.