ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటాప్ స్టార్లలో ఒకరు అక్షయ్కుమార్ (Akshay Kumar). కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బాక్సాపీస్ను షేక్ చేస్తున్నాడు. అయితే కొంతకాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్ త్వరలోనే రక్షాబంధన్ (Raksha Bandhan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు.
అక్షయ్ కుమార్ సినిమాలంటే దాదాపు చిన్నాపెద్దా అంతా కలిసి కుటుంబసమేతంగా చూసేలా ఉంటాయి. కెరీర్లో తాను ఓ జోనర్ మాత్రం టచ్ చేయలేదని అన్నాడు. ఇంతకీ ఆ జోనర్ ఏంటనే కదా మీ డౌటు. ఫ్యామిలీ ఆడియెన్స్ (Family Audience) కలిసి చూడలేని సినిమాలను తానెప్పుడూ ప్రయత్నించలేదన్నాడు అక్షయ్. ప్రజలకు తప్పుడు సందేశాలను పంపించాలనుకోవడం లేదని, అందుకే సైకో థ్రిల్లర్స్ ఎప్పుడూ ప్రయత్నంచలేదని చెప్పాడు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఖాతాలో సూరారై పోట్రు హిందీ రీమేక్, ఓ మై గాడ్ 2, రామ్ సేతు, సెల్ఫీతోపాటు మరో మూడు ప్రాజెక్టులున్నాయి. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రక్షాబంధన్లో భూమి పెడ్నేకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హిమేశ్ రేష్మియా మ్యూజిక్ డైరెక్టర్.