బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్కుమార్ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని తాను నటిస్తున్న తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’ ఫస్ట్లుక్ను సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. 1965 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారతదేశపు తొలి వైమానిక దాడి నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం దేశభక్తి ప్రధానంగా నడుస్తుందని అక్షయ్ కుమార్ తెలిపారు. ‘చాలా మందికి తెలియని కథ ఇది. భారతదేశపు తొలి వైమానిక దాడి సందర్భంగా జరిగిన పరిణామాలను కళ్లకు కడుతుంది. దేశభక్తి ప్రబోధించే చిత్రమిది. జై హింద్’ అంటూ అక్షయ్కుమార్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి సందీప్ కెల్వాని, అభిషేక్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న విడుదలకానుంది.