రవితేజ నటించిన ధమాకా చిత్రంతో రైటర్గా మంచి బ్రేక్ అందుకున్నాడు ప్రసన్నకుమార్ (Prasanna Kumar). ఈ యువ రచయిత ప్రస్తుతం అక్కినేని నాగార్జున (Nagarjuna)తో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మైసూర్లో ఇప్పటికే షురూ అయినట్టు ఇన్ సైడ్ టాక్. కాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravaani) ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్టు టాక్.
ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన పొరింజు మరియమ్ జోస్కు తెలుగు రీమేక్గా రానుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని లేటెస్ట్ ప్రాజెక్టును శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు నాగార్జున.
నాగార్జున, కీరవాణి కాంబినేషన్లో అన్నమయ్య, క్రిమినల్, రాజన్నతోపాటు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో వచ్చిన చాలా పాటలను ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. మళ్లీ చాలా కాలం తర్వాత నాగార్జున-కీరవాణి మరో సినిమాకు కలిసి పనిచేయబోతున్నారన్న వార్త ఆసక్తికరంగా మారింది.
Kushi | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఖుషి కొత్త షెడ్యూల్ అఫీషియల్ అప్డేట్
Oo Antava Mava | ఉ అంటావా మావా మేనియా రిపీట్.. డీజే మార్టిన్తో అల్లు అర్జున్ డ్యాన్స్
Ahimsa | అభిరామ్-తేజ టీం క్రేజీ అప్డేట్.. అహింస రిలీజ్ టైం ఫిక్స్