అగ్ర హీరో నాగార్జున నటించిన తా జా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్ కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ “టీవీలు వచ్చాక ఇక సినిమాలెవరూ చూడరు అన్నారు. ఫోన్లు వచ్చిన తర్వాతా అంతే అన్నారు. ఇప్పుడు ఓటీటీ అని కొత్తగా వచ్చినా, అన్నింటికీ మించి కొవిడ్ వచ్చినా సినిమాలకు ఆదరణ తగ్గలేదు. తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటే సినిమా పండుగే. ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేశ్బాబు ‘గుంటూరు కారం’తో వస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన తేజ ‘హను-మాన్’గా రాబోతున్నాడు. వెంకీ 75వ సినిమా ‘సైంధవ్’తో వస్తున్నాడు. అందరికీ ఆల్ ది బెస్ట్.
మేము ‘నా సామిరంగ’తో వస్తున్నాం. సంక్రాంతికి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అని ప్రసంగం ముగించారు. విజయ్ బిన్ని మాట్లాడుతూ ‘కొత్త డైరెక్టర్గా నాకు ఇంత పేరు తెచ్చిపెట్టిన టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఎన్నో సినీ వేడుకల్లో సామాన్యుల్లో ఒక్కడిగా పాల్గొన్న నేను డైరెక్టర్గా ఇప్పుడు ఈ స్టేజీ మీద డైరెక్టర్గా మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. నాగ్ సర్కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను’ అన్నారు.