Akkineni Nagarjuna – Amala | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ హీరో అక్కినేని నాగార్జున, అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి చేరుకున్న నాగార్జున దంపతులు రేవంత్కు పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామజిక మాద్యమాలలో వైరల్ అవుతున్నాయి
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాగార్జున దంపతులు ఆయనను కలవడం ఇదే మొదటిసారి. మరోవైపు రేవంత్ సీఎం అయిన అనంతరం పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు రేవంత్ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ హీరో నాగార్జున దంపతులు.
Famous film hero Nagarjuna couple paid a courtesy call to Chief Minister Shri Revanth Reddy at his residence.#Nagarjuna #Revanthreddy @iamnagarjuna @revanth_anumula pic.twitter.com/50UCARd3jt
— Congress for Telangana (@Congress4TS) December 30, 2023
అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘నా సామిరంగ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమామ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్తో పాటు టీజర్ను చిత్రబృందం విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.