వరుస ఫ్లాపుల తర్వాత అఖండ చిత్రంతో బంపర్ హిట్ కొట్టారు నందమూరి బాలకృష్ణ. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్రేకులు లేని బుల్డోజర్లా రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక యూఎస్లో కూడా అఖండ చిత్రం గర్జిస్తుంది. యూఎస్ లో నందమూరి అభిమానులు ప్రీమియర్ తో రికార్డు సృష్టించారు.
గతంలో తెలుగు సినిమాలు అవలీలగా ఓవర్సీస్లో మిలియన్ మార్క్ చేరుకునేవి . కాని కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది అంటే అదో పెద్ద అద్బుత విజయం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక్కడ పెద్ద హిట్ అయిన అఖండ సినిమా యూఎస్ లో మిలియన్ మార్క్ కు చేరుతుందా అంటూ విశ్లేషకులు కాస్త అనుమానం వ్యక్తం చేశారు. కాని ఓపెనింగ్స్ భారీగా నమోదు అవ్వడంతో పాటు పెద్ద ఎత్తున అక్కడ వసూళ్లు నమోదు అవ్వడంతో మిలియన్ మార్క్ ను టచ్ చేసింది.
అఖండ చిత్రం రెండవ ఆదివారం పూర్తి అయ్యేప్పటికి అక్కడ మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ అఫీషియల్గా ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో బోయపాటి- బాలకృష్ణ కాంబోలో మరో సినిమా రాబోతుందని, అది అఖండ సీక్వెల్గా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా, దీనిపై క్లారిటీ రావలసి ఉంది.