సౌత్ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమాలపై ఏం రేంజ్లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వాలిమై అనే సినిమాతో బిజీగా ఉన్నాడు అజిత్. తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకోగా, ఇది అందరికి పెద్ద షాకింగ్గా మారింది. తనని తన అని పిలవొద్దంటూ అభిమానులని మీడియాని విజ్ఞప్తి చేశాడు అజిత్. ఇందుకు కారణం మహేంద్ర సింగ్ ధోని అని కొందరు అంటున్నారు.
2000 సంవత్సరంలో దర్శకుడు ఏఆర్ మురగదాస్ డైరెక్షన్లో ధీనా చిత్రంలో నటించినప్పటి నుంచి అజిత్ను అభిమానులు ముద్దుగా తలా (నాయకుడు) పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆరంభంలో ఆయన్ను అందరూ ‘అల్టిమేట్ స్టార్’ అజిత్ అని పిలిచేవారు . కానీ అప్పట్లో కూడా ఓ ప్రకటన విడుదల చేసి ‘అల్టిమేట్ స్టార్’ అని పిలవకండని చెప్పారు. ఆ తర్వాత తన అభిమానుల సంఘాన్ని కూడా రద్దు చేశారు.
తాజాగా అభిమానులు ముద్దుగా పిలుచుకొనే తలా బిరుదును తన పేరు ముందు నుంచి తొలగించుకోవాలని నిర్ణయించుకొన్నారు అజిత్. ఇక నుంచి తన పేరుకు తలా అని జోడించవద్దని వేడుకొన్నారు. తనను ఇక నుంచి అజిత్ లేదా అజిత్ కుమార్ అని మాత్రమే పిలువాలని అజిత్ సూచించారు.
అజిత్ పీఆర్వో ఓ నోట్ విడుదల చేయగా, అందులో అభిమానులకు, ప్రజలకు, మీడియాకు విన్నవించుకొనేది ఏమిటంటే.. ఇక నుంచి తలా అని పిలువవద్దు. అజిత్ అని గానీ, అజిత్ కుమార్ అని గానీ, లేదా ఏకే అని పిలవండి లేదా రాయండి. నా పేరుకు ముందు తలాను జోడించవద్దు. ప్రస్తుతం సమయంలో మీరంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని అనుకొంటున్నా. మీ ఆదరణ ఎప్పటిలానే అందించాలని కోరుకొంటున్నాను అని అజిత్ తరఫున సురేష్ చంద్ర ట్వీట్ చేశారు.
తలా బిరుదును తొలగించుకోవడం వెనుక కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనిని కూడా తలా అని పిలుస్తున్నారు. ధోనిని అసభ్యకరమైన పదాలతో దూషించినప్పుడు తలా ట్రెండింగ్లోకి వస్తున్నాడు. ఆ కారణంతోనే అజిత్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని కొందరు భావిస్తున్నారు.