తునివు సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ఏకే 62 (AK 62) వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రాన్ని విఘ్నేశ్ శివన్ డైరెక్టర్ చేయాల్సి ఉండగా.. అతడి స్థానంలో కొత్త దర్శకుడు మేజిహ్ తిరుమెని రీప్లేస్ చేశారు మేకర్స్. హై బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన గాడ్ ఫాదర్ సినిమాకు పనిచేసిన నీరవ్ షా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేయబోతున్నాడు. ఏకే 62 అజిత్-నీరవ్ షా కాంబినేషన్లో రాబోతున్న నాలుగో సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పింక్ తమిళ రీమేక్, వలిమై, తునివు చిత్రాలు బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. మరి ఈ ఇద్దరు నాలుగో సినిమాతో ఎలాంటి ట్రెండ్ సృష్టిస్తారనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అరుణ్ విజయ్, అరుళ్నిధి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుండగా.. అరవింద్ స్వామి కీ రోల్ పోషించబోతున్నట్టు తెలుస్తోండగా.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో మొదలుకానుంది.
#AK62 Pooja completed yesterday
Director – Magizh Thirumeni
DOP – Nirav Shah
Music – AnirudhArun Vijay & Arulnithi approached for pivotal roles in the film.
Official announcement by Lyca in March 2023 with Title. pic.twitter.com/cxmaYS8r5c
— Venkatramanan (@VenkatRamanan_) February 21, 2023