అజయ్ వేద్ హీరోగా నటించిన సినిమా ‘మట్టి కథ’. గాయని కనకవ్వ, సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ పతాకంపై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. పవన్ కడియాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…“మట్టి కథ’ టైటిల్ నాకు బాగా నచ్చింది. మనం పుట్టేది, గిట్టేది మట్టిలోనే. తెలంగాణ అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి ప్రజల మనసు స్వచ్ఛమైనది.
ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. నిర్మాత అన్నపరెడ్డి అప్పిరెడ్డి మాట్లాడుతూ…‘ఒక పల్లెటూరి కుర్రాడు తన కలను నెరవేర్చుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఈ చిత్రంలో కళాత్మకంగా, సహజంగా చూపిస్తున్నాం. పల్లె ప్రజలకు భూమితో ఉన్న అనుబంధం, అక్కడి సరదాలు, కష్టాలు, ఆత్మీయతలు వాస్తవికంగా ఉంటాయి. భావోద్వేగాలతో కూడిన చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: కుంభం ఉదయ్, సంగీతం :స్మరణ్ సాయి.