కార్తికేయ, పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలలో అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత తన రెండో సినిమాగా ‘మహా సముద్రం’ అనే సినిమా చేశాడు. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం తెరకెక్కించాడు. ఈ చిత్ర కథను ఎప్పుడో రాసి పెట్టుకున్నాడు. పలువురు హీరోలు దీనిని రిజెక్ట్ చేయగా, చివరకు శర్వానంద్ ,వురు హీరోల చుట్టూ తిరిగాడు. చాలా మంది ఈ కథను తిరస్కరించారు. అయితే చివరకు అజయ్ భూపతి కథకు శర్వానంద్, సిద్ధార్థ్ పచ్చజెండా ఊపారు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది.
రీసెంట్గా విడుదలైన మహా సముద్రం చిత్రం ప్రేక్షకులకి ఏ మాత్రం అలరించలేకపోయింది. సన్నివేశాలు ఆసక్తికరంగా లేకపోవడంతో పాటు పాటలు కూడా అందతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా దారుణంగా నిరాశపరచడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో అజయ్ భూపతి.. ‘మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు క్షమించండి.. వచ్చేసారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తాను’ అని బదులిచ్చాడు.