Aishwarya Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తన భర్త ధనుష్తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి ఈ జంట ముగింపు పలికుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీని తర్వాత ఎవరి లైఫ్లో వారు బిజీ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ పూర్తి దృష్టి వాళ్ళ కెరీర్పై పెట్టారు. ప్రస్తుతం ధనుష్ తన సినిమా షూటింగ్లలో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ఐశ్వర్య, అనిరుధ్ రవిచంద్రన్తో కలిసి ‘పాయని’ అనే మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించింది.
తాజాగా ఈమె బాలీవుడ్లో దర్శకురాలిగా పరిచయం కాబోతున్నట్లు ప్రకటించింది. ‘ఓ సాతి చల్’ అనే ప్రేమకథకు ఈమె దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘ఇంతకంటే గొప్పగా వారాన్ని ప్రారంభించలేను. దర్శకురాలిగా బాలీవుడ్లో నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ‘ఓ సాథీ చల్’ అనే ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాను అని పేర్కొంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపింది. ఈ చిత్రాన్ని క్లౌడ్9 పిక్చర్స్ పతాకంపై మీను అరోరా నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఐశ్వర్య గతంలో ‘3’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించింది. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. దీనితో పాటు ‘వయ్ రాజ వయ్’ అనే కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించింది. ఇవే కాకుండా ‘సినిమా వీరన్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.