టాలీవుడ్ లో తెరకెక్కుతున్నమోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్. పవన్కల్యాణ్-రానా లీడ్ రోల్స్ చేస్తున్నారు.
ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉండగా..వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్లో ఐశ్వర్యారాజేశ్ను ఎంపిక చేసింది టీం.
ఐశర్యరాజేశ్ ఈ చిత్రంలో రానాకు జోడీగా నటించబోతుంది. నిర్మాత సూర్యదేవర నాగవంశి ఐశ్వర్యరాజేశ్ ను రానాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్టు చెప్పారు.
మరోవైపు పవన్ భార్య పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా..డేట్స్ సర్దుబాటు కాలేదట. రెమ్యునరేషన్ ఎక్కువగా చెల్లిస్తామని చెప్పినా..ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
పవన్కల్యాణ్ కు హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయలేదని నాగవంశీ చెప్పారు. మరి పవర్ స్టార్ సరసన నటించే అవకాశం ఏ హీరోయిన్ కొట్టేస్తుందో చూడాలి. సాగర్ చంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.