ముంబయి : బాలీవుడ్ నటి ఐశ్యర్యారాయ్ బచ్చన్కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. సిన్నార్లోని ఓ భూమికి సంబంధించి ఆమె పన్ను చెల్లించకపోవడంతో ఈ నోటీసులు జారీ చేశారు. ఏడాది నుంచి భూములకు సంబంధించిన పన్నులు చెల్లించడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు. నటితో పాటు మరో 1200 మంది సైతం పన్ను చెల్లించకపోవడంతో నోటీసులు పంపినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న వారిలో ఎల్బీ కుంజీర్ ఇంజినీర్, గుమ్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీసీ మరాఠా లిమిటెడ్, హోటలే లీలా వెంచర్ లిమిటెడ్, ఎస్ కే శివరాజ్, కుక్రేజా డెవలపర్ కార్పొరేషన్తో పాటు పలు కంపెనీలున్నాయి. వీరంతా పన్నులు చెల్లించక పోవడంతో ప్రభుత్వానికి రూ.1.11 కోట్లు నష్టం వాటిల్లుతోందని అధికారులు పేర్కొన్నారు. మార్చిలోగా పన్ను చెల్లించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఐశ్యర్యా రాయ్కు నాసిక్ సిన్నార్లోని అవడీ ప్రాంతంలో విండ్మిల్ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ఏడాదికి రూ.21.960 చెల్లించాల్సి ఉంది. సిన్నార్ ప్రాంతంలో ఐశ్యర్యారాయ్కి దాదాపు హెక్టార్ భూమి ఉందని సమాచారం.