1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ఐశ్వర్యరాయ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత నీలి కళ్ల సుందరికి మెల్లగా అవకాశాలు మొదలయ్యాయి. 1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ (ఇద్దరు) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేసింది. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
తెలుగు, తమిళం, హిందీ భాషలలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న ఐష్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ ‘పొన్నియన్ సెల్వన్’లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఐష్ సర్ప్రైజింగ్ లుక్లో కనిపించనుందని అంటున్నారు.
తాజాగా ఐష్ తన కూతురు, భర్తతో కలిసి ఎక్కడికో వెళుతున్న క్రమంలో ముంబై ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం అయింది. చేతిలో ఉన్న హ్యండ్బ్యాగ్ని ఐశ్వర్య పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది. అంతేకాకుండా కూతురు ఆరాధ్యను సైతం దగ్గరికి తీసుకుంది. ఈ క్రమంలో ఐష్ గర్భవతి అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లకు వివాహం కాగా, 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.