Seetha Payanam | యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) డైరెక్ట్ చేస్తున్న చిత్రం సీతా పయనం (Seetha Payanam). అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ యాక్టర్ నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
అతడు లిఫ్ట్ అడిగితే ఒకే అన్నాను.. ఇప్పుడు అతడు నా పక్కనే కూర్చున్నాడు అనే ఐశ్వర్యా అర్జున్ చెప్పే డైలాగ్తో షురూ అయింది ట్రైలర్. కారులో హీరోహీరోయిన్లు ఇద్దరూ ట్రావెల్ అవుతుంటే మధ్యలో అర్జున్ గ్రాండ్ ఎంట్రీ, ఆ తర్వాత ధ్రువ్ సార్జా యాక్షన్ పార్ట్ను చూడొచ్చు.
ఫ్యామిలీ అంటే బరువు కాదు.. ఆ రిలేషన్షిప్లో వాళ్ల సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా సాధింవవచ్చు.. అంటూ హీరో చెబుతున్న సంభాషణలు సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్కు కనెక్ట్ అవ్వడం పక్కా అని చెప్ప్తేస్తున్నాయి. ఓ వైపు మాస్.. మరోవైపు క్లాస్ టచ్ ఇస్తూ సాగే ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
అర్జున్ హోం ప్రొడక్షన్ బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్పై నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీలో అర్జున్, కన్నడ యాక్టర్ ధ్రువ్ సార్జా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిరంజన్, ప్రకాశ్ రాజ్, కోవై సరళ, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.