అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం సూపర్ఫామ్లో ఉంది. ముఖ్యంగా హిందీలో గత ఏడాది ఛావా, థామా వంటి భారీ హిట్స్తో రేసులో దూసుకుపోయింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో షాహిద్కపూర్తో కలిసి ‘కాక్టెయిల్-2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ఈ జోడీ మరో భారీ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలిసింది. ‘బధాయి హో’ ‘మైదాన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.
రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది. సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో నటిస్తున్నది. ఇదిలావుండగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఈ నెలలోనే వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 26న రాజస్థాన్ ఉదయ్పూర్లో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం.