టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్ (. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శోభితా ధూళిపాళ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కరోనా వేవ్స్ తో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఫైనల్గా రిలీజ్ డేట్పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మే 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా మేజర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
The Teaser was just a glimpse of the
RAMPAGE in #MajorTheFilm
AIM.
SET.
LOCK.MAY 27th. 2022.
This Summer.
Worldwide.
Theaters Only. pic.twitter.com/UEVa92j5Q3— Adivi Sesh (@AdiviSesh) February 22, 2022
పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెలుగు, హిందీతోపాటు వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రానికి టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్బాబు(Mahesh Babu) వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. శోభితా ధూళిపాళతోపాటు బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ వేసవి కానుకగా మీ ముందుకు రాబోతుంది అంటూ రిలీజ్ డేట్ను లాక్ చేస్తూ స్పెషల్ గ్లింప్స్ వీడియోను అడివి శేష్ ట్విటర్ వేదికగా షేర్ చేసుకున్నాడు.