‘గూఢచారి’ ‘మేజర్’ ‘హిట్-2’ చిత్రాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు యువ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ‘గూఢచారి-2’ చిత్రంలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అడివి శేష్ బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారని తెలిసింది.
‘మేజర్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో అడివి శేష్ ఉత్తరాదిలో కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆయనతో ఓ యాక్షన్ లవ్స్టోరీకి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.