మా ‘తీస్మార్ఖాన్’ సినిమా ఇటీవలే చూశాను. దర్శకుడు కథను చెప్పినప్పుడు ఎంత థ్రిల్గా ఫీలయ్యానో.. ఇప్పుడు సినిమాను చూసినప్పుడు అంతకు మించిన అనుభూతిని పొందాను. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి. ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘తీస్మార్ఖాన్’. ఈ నెల 19న చిత్రం విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సినిమా చూసిన తరువాత విజయంపై మరింత నమ్మకం పెరిగింది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే అంశాలు చిత్రంలో వున్నాయి. స్టూడెంట్, రౌడీ, పోలీస్గా మూడు వేరియేషన్స్ వున్న పాత్రల్లో కథానాయకుడి నటన అందరూ ప్రశంసించే స్థాయిలో వుంటుంది’అన్నారు.