యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈచిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఏళ్లు పడుతుందని అందరు అనుకున్నారు.కాని కేవలం 103 రోజులలో షూటింగ్ పూర్తి చేశారు. ‘ఆదిపురుష్ షూట్ 103 రోజుల్లో ముగిసింది. ఓ అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుంది. మేము క్రియేట్ చేసిన మ్యాజిక్ ని మీతో పంచుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను’’ అని దర్శకుడు ఓం రౌత్ పేర్కొన్నారు.
అయితే ఇంత స్పీడ్గా షూటింగ్ పూర్తి చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన నెటిజన్స్ అంతే స్పీడ్గా మూవీ అప్డేట్స్ కూడా ఇవ్వండని అంటున్నారు. ఆదిపురుష్ చిత్రం రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతుంది. ఇందులో రాముడిగా ప్రభాస్ ఆయనకు జోడీగా సీత పాత్రలో నటి కృతిసనన్ సందడి చేయనున్నారు. రామాయణంలో ముఖ్యంగా చెప్పుకునే లంకేశుడి పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రను సన్నీసింగ్ పోషించారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మాతలుగా వ్యవహరించారు. వచ్చే ఏడాది ఆగస్టు 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే వెల్లడించింది చిత్రబృందం.