Adipurush Movie Nizam Rights | టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీస్ ఒకటి. తెలుగులోనే కాదు సౌత్లోనూ అత్యంత బిజీగా ఉన్న సంస్థ ఇదే. నెలల గ్యాప్లోనే సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంది. గతేడాది కాస్త డల్ అయినట్లు కనిపించినా ఈ సంక్రాంతితో మళ్లీ పుంజుకుంది. ఇక సంక్రాంతి బరిలో ఇద్దరు పెద్ద హీరోలను దింపి 91ఏళ్ళ టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఇంతవరకు ఏ ప్రొడక్షన్ సంస్థ చేయని సాహసం చేసింది. అంతేనా.. స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టి మరీ బ్లాక్బస్టర్ హిట్లు కొట్టి విజయభేరి మోగించింది. మైత్రీ సంస్థ నిర్మాణమే కాదు డిస్ట్రిబ్యూషన్లోనూ దూసుకుపోవాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే చిన్న సినిమాలను డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తుంది. కాగా తాజాగా ఈ సంస్థ ఆదిపురుష్ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సంస్థ రిలీజ్ చేస్తున్న పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా నైజాం హక్కుల కోసం రూ.60 కోట్లు చెల్లించినట్లు టాక్. అయితే ఇందులో ఓ తిరకాసు ఉన్నట్లు తెలుస్తుంది. ఆదిపురుష్ సినిమా నైజాంలో రూ.60 కోట్లు కలెక్ట్ చేయకపోతే రిటర్న్ రూ.10 కోట్లు చెల్లించేలా ఆదిపురుష్ మేకర్స్ తో డీల్ కుదిరించుకున్నట్లు టాక్. రామయాణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఎక్కడలేని హైప్ తీసుకొచ్చింది. ప్రభాస్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురిడిగా కనిపించనున్నాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.