ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న పౌరాణిక నేపథ్య చిత్రం ‘ఆదిపురుష్’. కృతి సనన్ సీత పాత్రను పోషిస్తున్నది. ఓం రౌత్ దర్శకుడు. జూన్ 16న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈలోగా సినిమా విడుదల తేదీలో మరోమారు మార్పులు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. అయితే రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదని, అనుకున్న తేదీనే సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం నుంచి సమాచారం అందుతున్నది.
టీజర్ విషయంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో గ్రాఫిక్స్ ఆధారిత సన్నివేశాలను మరింత సహజంగా తీర్చిదిద్దుతున్నారట. అత్యున్నత సాంకేతిక విలువలు, భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ చిత్రానికి ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది. 2డీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్షన్స్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.